(బిఎన్ న్యూస్), మార్చి 04: ఈనెల 6వ తేదీ స్పందన కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో ఈ సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మినహా మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
