(బిఎన్ న్యూస్), మార్చి 03: పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శుక్రవారం జిల్లాలోని 42 చెంచు గూడెంలలో మౌలిక వసతుల పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి లింగ నిర్ధారణ, వడదెబ్బ సోకకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎమ్హెచ్ఓ ఆర్.వెంకటరమణ, అడిషనల్ డిఎమ్హెచ్ఓ డా.బాలాజీ, డిసిహెచ్ఎస్ డా.జఫ్రుల్లా, డిఈఎమ్ఓ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
